
నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
ఆదిలాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు నిజాయతీ చాటుకున్నారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్కు వెళ్లే బస్సులో శనివారం ప్రయాణించిన అక్రమ్ బేగం అందులోనే తన బ్యాగు మర్చిపోయింది. గుర్తించిన కండక్టర్ వి.రమణ, డ్రైవర్ ఎం. గులాబ్ ఆ బ్యాగును డిపో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్కు అప్పగించారు. వివరాలు తెలుసుకున్న డిపో అధికారులు సదరు మహిళకు ఆదివారం బ్యాగు అందించారు. అందులో 12 గ్రాముల బంగారం ఒక సెల్ఫోన్, రూ. వెయ్యి నగదు ఉన్నట్లు ప్రయాణికురాలు పేర్కొన్నారు. సిబ్బంది, యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.