
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని అడెపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. బాబాసాగర్ గ్రామం నుంచి ట్రాలీ వాహనం కాగజ్నగర్ వైపు వెళ్తుండగా, కాగజ్నగర్ నుంచి ముంజంపల్లి వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో బోల్తా పడగా, ట్రాలీ వాహనం రోడ్డు కిందకు పడిపోయింది. ఆటో డ్రైవర్ డుబ్బుల అంజన్న తలకు గాయాలు కాగా, ట్రాలీ డ్రైవర్ దీపక్కు స్వల్ప గాయాలయ్యాయి. అంజన్నను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఇస్లావత్ నరేశ్ ఘటనా స్థలిని పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.