ఆవుదూడను చంపిన కేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆవుదూడను చంపిన కేసులో నిందితుడి అరెస్ట్‌

Jun 2 2025 12:26 AM | Updated on Jun 2 2025 12:26 AM

ఆవుదూ

ఆవుదూడను చంపిన కేసులో నిందితుడి అరెస్ట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఆవుదూడను చంపిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భోరజ్‌ మండలం సిర్సన్న గ్రామానికి చెందిన సాయికుమార్‌కు చెందిన ఆవుదూడను అదే గ్రామానికి చెందిన రాథోడ్‌ సంజయ్‌ గిమ్మ శివారులో కత్తితో పొడిచాడు. జైనథ్‌ సీఐ సాయినాథ్‌, ఎస్సై గౌతమ్‌ అక్కడికి చేరుకోగా కొద్ది సేపటికే ఆవుదూడ మృతిచెందింది. పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు వివరించారు. ఆవుదూడను చంపి అటవీ జంతువుల మాంసంగా అమ్మేందుకు ప్రయత్నం చేసినట్లు తెలిపారు. నిందితుడిపై గతంలో మేకల దొంగతనం, గుడిలో దొంగతనం, ఫారెస్ట్‌ కేసులు నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఆవులను అక్రమంగా తరలించినా, చంపినా చట్టరీత్యా నేరమని అన్నారు. ఇలాంటి వారిపై సస్పెక్ట్‌ షీట్‌ ఓపెన్‌ చేస్తామని హెచ్చరించారు.

ఆవుదూడను చంపిన   కేసులో నిందితుడి అరెస్ట్‌1
1/1

ఆవుదూడను చంపిన కేసులో నిందితుడి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement