
కొల్లగొడుతున్నారు
వివరాలు 8లో u
జడ్చర్ల: రాష్ట్రంలోనే డార్క్ ఏరియాగా గుర్తించిన మిడ్జిల్ మండలంలోనూ దుందుభీ వాగును కొల్లగొడుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారినా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడకపోగా మరింత యథేచ్ఛగా సాగుతోంది. మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాలతోపాటు నాగర్కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట, తాడూరు, కల్వకుర్తి, ఉప్పునుంతల తదితర మండలాల్లోని అనేక గ్రామాల రైతాంగానికి ఆయువు పట్టుగా ఉన్న దుందుభీ వాగు నుంచి నిత్యం వందలాది లారీలలో ఇసుకను తరలిస్తుండడంతో తీవ్ర దుర్బిక్ష పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఏర్పడింది. గతంలో దొడ్డిదారిన రాత్రివేళల్లో సాగే ఇసుక దందా ప్రస్తుతం అనుమతుల మాటున ధర్జాగా సాగుతోంది.
నిబంధనలు బేఖాతర్
మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో దుందుభీ వాగు పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇసుక తవ్వకాల అనుమతులను కలెక్టర్ రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా నిబంధనలను ఉల్లంఘించి 10– 12 అడుగుల మేరకు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. టీజీఎండీసీ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నా సంబంధిత అధికారులు జాడ లేకుండాపోయింది. అధికారులు అమ్యామ్యాల మత్తును వీడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికార, ప్రతిపక్ష పార్టీలు..
ఇసుక అక్రమ రవాణాలో పాలక పక్షానికి వ్యతిరేకంగా ప్రజాపక్షంగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం బినామీగా భాగస్వామ్యం కావడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికై నా అధికార, విపక్ష పార్టీలు తీరు మార్చుకుని తమ పక్షాన నిలబడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. డార్క్ ఏరియా ప్రయోజనాలను కాపాడే విధంగా కలెక్టర్తోపాటు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అనుమతులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి వివరణ కోరేందుకు టీజీఎండీసీ, తహసీల్దార్ అధికారులను ఫోన్లో సంప్రదించగా స్పందించకపోవడం గమనార్హం.
డార్క్ ఏరియాలోనూ అనుమతుల మాటున ఇసుక అక్రమ రవాణా
బినామీలుగా మారిన
అధికార, విపక్ష నాయకులు
అడుగంటుతున్న భూగర్భజలాలు
ఆందోళనలో పరిసర
గ్రామాల రైతులు

కొల్లగొడుతున్నారు