బోర్లు అడుగంటాయి.. | - | Sakshi
Sakshi News home page

బోర్లు అడుగంటాయి..

Jun 24 2025 3:55 AM | Updated on Jun 24 2025 3:55 AM

బోర్ల

బోర్లు అడుగంటాయి..

కొత్తపల్లి శివారులోని ప్రభుత్వ భూముల్లో సైతం ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. సర్వే నం.97లో 7.35 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమిని కూడా వదలడం లేదు. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపుపై విజిలెన్స్‌ అధికారులు, కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలి.

– కృష్ణయ్య, రైతు, కొత్తపల్లి

ఆందోళన చేసినం..

కొత్తపల్లి వద్ద ఇసుక క్వారీ అక్రమాలపై ఆందోళన చేపట్టాం. అక్కడే టెంటు వేసుకుని వంటావార్పు చేసుకుంటూ రోజుల తరబడి నిరసన తెలిపాం. మాకు అధికార, విపక్ష పార్టీ నేతలు ఎవరూ సంఘీభావం కూడా తెలుపలేదు. అధికారులైతే అటువైపు కన్నెతి చూడలేదు. ఇప్పటికై నా స్పందించి న్యాయం చేయాలి.

– పాండు, మాజీ సర్పంచ్‌, కొత్తపల్లి

చర్యలు తీసుకోవాలి..

ప్రభుత్వ నిబంధనలు ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అంతేగాక నిబంధనల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన అక్రమార్జనను రాబట్టాలి. అక్రమార్కులకు వంత పాడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. కొత్తపల్లి ఇసుక క్వారీ అనుమతులను రద్దు చేయాలి.

– రాజేశ్వర్‌, బీజేపీ నాయకులు, మిడ్జిల్‌

బోర్లు అడుగంటాయి.. 
1
1/2

బోర్లు అడుగంటాయి..

బోర్లు అడుగంటాయి.. 
2
2/2

బోర్లు అడుగంటాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement