
ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదు
జడ్చర్ల: మిడ్జిల్ మండలం దుందుభీ వాగులో కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాలపై సోమవారం అనుమతుల మాటున..శీర్షికన సాక్షిలో వచ్చిన కథనంపై స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి స్పందించారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం ఆయన మాట్లాడారు. దుందుభీ వాగులో నిబంధనలు అతిక్రమంచి ఇసుక తవ్వకాలు చేపడితే వెంటనే వాహనాలు సీజ్ చేయాల్సిందిగా స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమాలను సహించేది లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలేపల్లిలో పరిశ్రమలకు నీటి రవాణా చేస్తున్న పలువురు ఎమ్మెల్యేను కలిసి సమస్య వివరించారు. ఇటీవల విద్యుత్ విజిలెన్స్ అధికారులు తమపై కేసులు నమోదు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.