అమాయక రైతులపైఅక్రమ కేసులు పెడతారా? | - | Sakshi
Sakshi News home page

అమాయక రైతులపైఅక్రమ కేసులు పెడతారా?

Jun 5 2025 7:40 AM | Updated on Jun 5 2025 7:40 AM

అమాయక రైతులపైఅక్రమ కేసులు పెడతారా?

అమాయక రైతులపైఅక్రమ కేసులు పెడతారా?

వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే అమాయక రైతులపై కేసులు పెట్టడం తగదని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఇథనాల్‌ కంపెనీ ఘటనలో అరెస్టు చేసిన రైతులను మానవపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ వద్దని చెబితే రైతులను తీసుకొచ్చి అక్రమంగా కేసులు నమోదు చేస్తారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పెద్ద ధన్వాడలో జరిగిన ఘటనలో రైతులకు దెబ్బలు తగిలాయని చెప్పారు. రైతులకు తగిలిన దెబ్బలను పోలీసులకు చూపుతూ...వారి నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. ఫ్యాక్టరీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం తొత్తుగా మారిందని, అందుకే రైతులపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. మండలంలో 45 మంది రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని, వాటిని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. 12 గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా దానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement