
జాతీయస్థాయి నెట్బాల్లో ధన్వాడ విద్యార్థి ప్రతిభ
ధన్వాడ: జాతీయస్థాయి నెట్బాల్ పోటీల్లో ధన్వాడకు చెందిన శివకుమార్ ప్రతిభ చాటాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ నెల 25 నుంచి 28 వరకు 31వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల నెట్బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెంగాణ రాష్ట్రాం తరపున పాల్గొన్న ధన్వాడ గ్రామానికి చెందిన కె.శివకుమార్ ప్రతిభభ కనబరిచి రన్నరప్గా నిలిచి కంచు (బ్రాంజ్) పతకం సాధించినట్లు కోచ్ డాక్టర్.రామ్మోహన్గౌడ్ తెలిపారు.
చికిత్స పొందుతూ
యువకుడి మృతి
అచ్చంపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని పల్కపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెర్ముల సురేష్ (30) ఈనెల 24న అచ్చంపేట నుంచి స్వగ్రామానికి స్కూటీపై వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైద్రాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.