
మనస్తాపంతో మహిళ బలవన్మరణం
రాజోళి: భర్తను, కుటుంబాన్ని కాదని వెళ్లిపోయిన మహిళ మళ్లీ ఇంటికి వచ్చినప్పటికీ ఆమె జీవింతం అర్ధాంతరంగా ముగిసింది. ఎస్ఐ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం రాజోళికి చెందిన ప్రతాప్ భార్య సుజాతకు గ్రామానికి చెందిన కుర్వ పుల్లన్నతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారు ఇద్దరు ఈ నెల 12న కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా ఈ నెల 25న సుజాత స్థానిక పోలీస్స్టేషన్కు రావడంతో పోలీసులు ఆమెతో మాట్లాడారు. గ్రామానికి చెందిన పుల్లన్నతో తన ఇష్టపూర్వకంగా వెళ్లానని, పలు ప్రాంతాల్లో తిరిగిన అనంతరం వరంగల్లో కొన్నాళ్లు ఉన్నామన్నారు. ఈ క్రమంలో 27న ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. కానీ కుర్వ పుల్లన్న అదే రోజు ఎలుకల మందు తాగడంతో ఆయనను చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకవైపు పుల్లన్న ఆత్మహత్యాయత్నం చేసుకోవడం, మరోవైపు కుటుంబ సభ్యులు బాధపడుతుండటంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలికి 9 ఏళ్ల కుమార్తె చందు ఉంది. ఘటనపై మృతురాలి తల్లి రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వివాహిత దుర్మరణం
అయిజ: ద్విచక్ర వాహనంపై నుంచి పడి వివాహిత మృతిచెంది న ఘటన అయిజ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని కిష్టాపూర్కు చెందిన కుమ్మరి నర్సింహులు, తన కుమారుడు రామాంజనేయులు, కోడలు మంజుల (20)తో పాటు 8నెలల మనవడితో కలిసి బైక్పై బంధువుల గ్రామానికి బైక్పై బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సోముల గూడూరు సమీపంలో మంజుల ప్రమాదవశాత్తు బైక్పై నుంచి జారిపడింది. ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు తెలిపారు. మంజుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ద్విచక్ర వాహనాన్ని
ఢీకొట్టిన లారీ..
ఇద్దరి దుర్మరణం
దేవరకొండ: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలానికి చెందిన ఈడమోని శ్రీశైలం(44), ఊర్కొండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన ఈరెటి బచ్చయ్య(40) వరుసకు బంధువులు. శ్రీశైలం, బచ్చయ్య వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరు కలిసి పశువులను కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై మంగళవారం మిర్యాలగూడకు వచ్చారు. త్రిపురారం వద్ద వారికి అవసరమైన పశువులను కొనుగోలు చేశారు. రాత్రి కావడంతో అక్కడే బసచేసి బుధవారం ఉదయం స్వగ్రామాలకు బయల్దేరారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో దేవరకొండ పట్టణంలోని మనోజ్ థియేటర్ సమీపంలోకి రాగానే కొండమల్లేపల్లి నుంచి ఐరన్ లోడ్తో కల్వకుర్తి వైపు వెళ్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీశైలం, బచ్చయ్య తీవ్రంగా గాయపడ్డారు. శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందగా.. బచ్చయ్యను చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దేవరకొండ సీఐ నర్సింహులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు శ్రీశైలం కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మనస్తాపంతో మహిళ బలవన్మరణం