అనుమతిలేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అనుమతిలేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు

May 28 2025 11:57 AM | Updated on May 28 2025 11:57 AM

అనుమతిలేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు

అనుమతిలేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు

కేసముద్రం: అనుమతిలేని విత్తనాలను విక్రయిస్తే సంబంధిత డీలర్‌పై విత్తనచట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీలోని రైతువేదికలో కేసముద్రం, ఇనుగుర్తి మండలాలకు చెందిన విత్తన, ఎరువుల, పురుగుమందుల డీలర్లకు ఎరువులు, విత్తనాల అమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లూజు పత్తి విత్తనాలు, అనుమతిలేని బీటీ–3 పత్తి విత్తనాలు అమ్మితే రైతులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి డీలర్‌ చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకోవాలన్నారు. అదే విధంగా రిజిస్టర్‌లు, బిల్లుబుక్కులు మెయింటైన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు వివేక్‌, రవీందర్‌, ఎస్సై మురళీధర్‌రాజు, ఏఓలు బి.వెంకన్న, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement