పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం.. | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం..

May 13 2025 1:06 AM | Updated on May 13 2025 1:06 AM

పుష్క

పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం..

హన్మకొండ/కాళేశ్వరం: ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతీనది పుష్కరా లకు టీజీఎస్‌ ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ మేరకు ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ యాజమాన్యం, అధికా రులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానా లకు చేరవేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ప్రతీ రోజు 140 బస్సులకు తగ్గకుండా నడిపేందుకు ప్రణాళిక సి ద్ధం చేశారు. భక్తుల సంఖ్య పెరిగితే మరిన్ని అదనపు బస్సులు నడిపేందు కు సిద్ధంగా ఉన్నారు. హనుమకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ నుంచి 40 బస్సులు, వరంగల్‌ బస్‌ స్టేషన్‌ నుంచి 25, జనగామ, పరకాల, నర్సంపేట బస్‌ స్టేషన్‌ నుంచి 10 చొప్పున, భూపాలపల్లి నుంచి 20, తొర్రూరు, మహబూబాబాద్‌ బస్‌ స్టేషన్‌ నుంచి 5 చొప్పున, హైదరాబాద్‌ నుంచి 15 ప్రత్యే క బస్సులు నడిపేలా కార్యాచరణ రూపొందించారు. అదే విధంగా హైదరాబాద్‌ నుంచి ఏసీ బస్సులు నడుపనున్నారు. ఏసీ బస్సులకు హైదరా బాద్‌ నుంచి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. ఈ నెల 13 నుంచి రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. సరస్వతీనది పుష్కరాలు జరిగే కాళేశ్వరంలో నాలుగు ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. మొత్తం 9 పాయింట్లు ఉంటాయి. 9 పాయింట్ల నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు బయలుదేరుతాయి. కాళేశ్వరంలో ఇద్దరు అధికారులు, 10 మంది సూపర్‌ వైజర్లు, 20 మంది వలంటీర్లు నిరంతరాయంగా సేవలు అందిస్తారు. ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, సరస్వతీనది పుష్కరాలకు చార్జీలు ఖరారు చేశారు. సాధారణ చార్జీలతో చూసుకుంటే ఒకటిన్నర రెట్లు చార్జీలు పెంచారు.

రూట్‌ల వారీగా ప్రత్యేక బస్సుల చార్జీల వివరాలు ఇలా..

రూట్‌ బస్సు సర్వీస్‌ పెద్దలకు పిల్లలకు

(రూ.) (రూ.)

హనుమకొండ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ 250 140

ఎలక్ట్రిక్‌ ఎక్స్‌ప్రెస్‌ 260 150

డీలక్స్‌ 290 160

ఎలక్ట్రిక్‌ డీలక్స్‌ 310 180

సూపర్‌ లగ్జరీ 330 190

ఎలక్ట్రిక్‌ సూపర్‌ లగ్జరీ 350 210

రాజధాని 420 330

గరుడ (+) 500 380

నర్సంపేట – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ 330 180

మహబూబాబాద్‌ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ 400 220

తొర్రూరు – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ 360 190

జనగామ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ 390 220

భూపాలపల్లి –కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ 120 70

సూపర్‌ లగ్జరీ 160 100

పరకాల – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ 190 110

హైదరాబాద్‌ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ 570 320

డీలక్స్‌ 670 370

సూపర్‌ లగ్జరీ 760 420

రాజధాని 960 740

గరుడ (+) 1130 870

ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

సరస్వతీనది పుష్కరాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ సేవలు సద్వి నియోగం చేసుకోవాలి. భక్తులను చేరవేసేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. భద్రతతో కూడిన సౌకర్యవంత ప్రయాణం అందిస్తాం. అవసరమైతే బస్సుల సంఖ్య పెంచుతాం. అధికారుల నిరంతర పర్యవేక్షణలో సురక్షితంగా, క్షేమంగా భక్తులను చేరవేస్తాం.

డి.విజయభాను, రీజినల్‌ మేనేజర్‌, వరంగల్‌

ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు

రోజుకు 140 ట్రిప్పులు.. భక్తుల సంఖ్య పెరిగితే

మరిన్ని అదనపు సర్వీసులు

ఏసీ బస్సులకు హైదరాబాద్‌ నుంచి

రిజర్వేషన్‌ సౌకర్యం

చార్జీలు ఖరారు చేసిన అధికారులు

పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం.. 1
1/1

పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement