‘నీట్‌’ను పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ను పకడ్బందీగా నిర్వహించాలి

May 2 2025 12:43 AM | Updated on May 2 2025 1:51 PM

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో నీట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సదర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 4న మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు 513 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరవుతారన్నారు. అబ్జర్వర్లతో పాటు 46 మంది ఇన్విజిలేటర్లు అందుబాటులో ఉంటారన్నారు. 

సీసీ కెమెరాల పనితీరు సరిచూసుకోవాలని, నూతన కెమెరాలను అమర్చాలని, విద్యుత్‌ అంతరాయం లేకుండా, తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, విద్యార్థులు గంటముందు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరబ్రహ్మచారి, డీఎస్పీ తిరుపతిరావు, ఆర్డీఓ కృష్ణవేణి, డీఈఓ రవీందర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ జాక్విన్‌, తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్‌ ముఖేష్‌, మెడికల్‌, ఫైర్‌, విద్యుత్‌శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డీఈఓకు సన్మానం

మహబూబాబాద్‌ అర్బన్‌: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మానుకోట జిల్లా మొదటి స్థానం సాధించడంతో విద్యాశాఖ టీఎన్జీఓఎస్‌ ఉద్యోగ సంఘం నాయకులు డీఈఓ రవీందర్‌రెడ్డి, ఏసీజీఈ మందుల శ్రీరాములును గురువారం జిల్లా కార్యాలయంలో సన్మానించారు. కార్యక్రమంలో విద్యాశాఖ టీఎన్జీఓఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.గణేశ్‌, ఎండి.ముజాహిద్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌లు ఎ.ఉమామహేశ్వర్‌, కె.జ్యోతి, శ్రీనివాస్‌, ఉద్యోగులు సమద్‌అహ్మద్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యానైపుణ్యాలు పెంపొందించుకోవాలి

మహబూబాబాద్‌ రూరల్‌: విద్యార్థులు విద్యానైపుణ్యాలు పెంపొందించుకోవాలని విద్యాశాఖ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌ ఆజాద్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మహబూబాబాద్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో వేసవి ప్రత్యేక తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఈనెల 31 తేదీ వరకు నెల రోజుల పాటు ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు వేసవి ప్రత్యేక తరగతులు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు హ్యాండ్‌ రైటింగ్‌, వేదిక్‌ మ్యాథ్స్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారని, ఈ అవకాశాన్ని బ్రాహ్మణపల్లి, కొమ్ముగూడెం, జిల్లెల్లగూడెం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం 9, 10 తరగతులకు వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సదుపాయాలతో, పాటు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ధారావత్‌ భద్రు, ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్య ప్రకాశ్‌, బొమ్మెర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్‌, బానోత్‌ శంకర్‌, గిద్దె శృతి, గ్రామస్తులు పాషా, అప్రోజ్‌, శ్రీనివాస్‌, ముఖేశ్‌, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కార్మిక చట్టాలపై అవగాహన

నెహ్రూసెంటర్‌: కార్మిక చట్టాలు, హక్కులపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం మే డే సందర్భంగా కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ న్యాయ సహాయ న్యాయవాది దాసరి నాగేశ్వర్‌రావు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు బి.విజయసారథి, అజయ్‌సారథిరెడ్డి, న్యాయవాదులు భూక్య మోహన్‌నాయక్‌, కట్కూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement