
జిల్లా కోర్టు, పోలీసు కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జిల్లా కోర్టు భవనాల సముదాయ ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ సోమవారం పోలీసుల నుంచి వందనం స్వీకరించి జాతీయ జెండా ఎగురవేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు.
నేటి నుంచి టెన్త్
సప్లిమెంటరీ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 3నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో సోమవారం డీఎస్ఓ, ఇన్విజిలేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఒకటే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 87 మంది పరీక్ష రాస్తారని, పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యుత్, తాగునీరు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9849761012 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.సమావేశంలో పరీక్షల విభాగం అధికారి మందుల శ్రీరాములు, సీఎస్ఓ పూజరి వీరయ్య, డీఓ సంజీవ, ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు.
అదనపు
సబ్ రిజిస్ట్రార్గా నసీమా
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయంలో సోమవారం అదనపు సబ్రిజిస్ట్రార్గా నసీమా బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆర్ఓ విభాగంలో పనిచేసే ఆమెను మానుకోటకు అదనపు సబ్ రిజిస్ట్రార్గా బదిలీ చేశా రు. కాగా ఆమెకు దస్తావేజ్ లేకరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు యశ్వంత్, భరత్, సురేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.