మహబూబాబాద్ రూరల్: క్షయ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులువాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ సబ్ జైలులో సోమవారం నిర్వహించిన ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ హాజరై మాట్లాడారు. జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పాటుపడాలన్నారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, సాయంత్రం జ్వరం రావడం, ఛాతిలో నొప్పి రావడం వంటి లక్షణాలు ఉన్నవారు తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. క్షయవ్యాధి ఉంటే ఆరు నెలలపాటు మందులు వాడితే పూర్తిగా కోలుకుంటారన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి విజయకుమార్, సబ్ జైలు ఇన్చార్జ్ సూపరిండెంటెంట్ భిక్షపతి, డాక్టర్ మౌనిక, డాక్టర్ నర్మద, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, టీబీ ప్రోగ్రాం మేనేజర్ నీలిమ, శ్వేత, అశోక్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.