థ్యాంక్యూ సాక్షి | - | Sakshi
Sakshi News home page

థ్యాంక్యూ సాక్షి

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

థ్యాంక్యూ సాక్షి అత్యధిక మార్కులు వచ్చాయి స్కూల్‌ టాపర్‌గా నిలిచా

నాకు పదో తరగతిలో 590 మార్కులు రావడం ఆనందంగా ఉంది. మా నాన్న ఖాజామొహిద్దీన్‌ పాత టైర్ల షాపును నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. మా అమ్మ గృహిణి. మాది నిరుపేద కుటుంబం. సాక్షి యాజమాన్యం మా పాఠశాలలో పదో తరగతి మెటీరియల్‌ను పంపిణీ చేసింది. ఉపాధ్యాయులు బోధించే పాఠాలతో పాటు సాక్షి మెటీరియల్‌తోనే 590 మార్కుల స్కోరింగ్‌ సాధ్యమైంది. డాక్టర్‌ కావడం నా కల.

– షేక్‌ అనీషాతబసుమ్‌, ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం అయ్యే సమయంలో సాక్షి మీడియా ఉచితంగా ఇచ్చిన స్టడీ మెటీరియల్‌ ఉపయోగపడింది. నేను 519 మార్కులు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. ఈ మెటీరియల్‌లో ఉన్న అత్యధిక ప్రశ్నలు రావడంతోనే అధిక మార్కులు వచ్చాయి. ఇందుకు కారణమైన సాక్షికి ధన్యవాదాలు.

– మహేష్‌బాబు, ఆలూరు

టెన్త్‌ పరీక్షలకు ముందు సాక్షి మీడియా గ్రూప్‌ వారు ఉచితంగా అందించిన స్టడీ మెటీరియల్‌ నాకు ఎంతో ఉపయోగపడింది. ఉపాధ్యాయులు మంచి నోట్సు అందించారు. దీంతో పరీక్షల్లో 577 మార్కులు సాధించా. స్కూల్‌ టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది.

– కె.గౌతమి, ఆదోని మున్సిపల్‌ హైస్కూల్‌

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌

ఆ మెటీరియల్‌ చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు

సాక్షి మెటీరియల్‌

అందుకున్న విద్యార్థినులతో

ఉపాధ్యాయులు(ఫైల్‌)

కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఇవ్వడంతో దానిని చదివిన వారు ఉత్తమ ఫలితాలను సాధించారు. చాలా మందికి 500పైగా మార్కులు వచ్చాయి. ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తోనే ఇదంతా సాధ్యమైందని వారు తెలిపారు. ప్రతి ఏటా ప్రభుత్వ సాధారణ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఆయా సబ్జెక్టుల భోధనలో అత్యంత అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో నిపుణుల బృందం ఏర్పాటు చేసి స్టడీ మెటీరియల్‌ను తయారు చేసి విద్యార్థులకు ఇచ్చేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి స్టడీ మెటరియల్‌ ఇవ్వలేదు. కేవలం పీడీఎఫ్‌ రూపంలో ఉన్న మెటీరియల్‌ను టీచర్లకు ఇస్తున్నారు. విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఆయా సబ్జెక్టుల నిపుణులతో స్టడీ మెటీరియల్‌ను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించారు. ఉపాధ్యాయుల బోధనతో పాటు స్టడీ మెటిరియల్‌ తోడు కావడంతో విద్యార్థులు గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఉత్తమ మార్కులు సాధించారు. కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా సర్కార్‌ బడుల్లోని విద్యార్థులకు మార్కులు వచ్చాయి. సాక్షి మీడియా గ్రూప్‌ ఇచ్చిన మెటీరియల్‌ అత్యుత్తమ మార్కుల సాధనకు ఉపయోపడినట్లు విద్యార్థులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement