స్కూల్‌లో సెకెండ్‌ ప్లేస్‌లో నిలిచాను | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌లో సెకెండ్‌ ప్లేస్‌లో నిలిచాను

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

స్కూల్‌లో సెకెండ్‌ ప్లేస్‌లో నిలిచాను ఎంతో ఉపయోగం మార్కుల సాధనకు సులువైంది

పదో తరగతి పరీక్షలకు ముందు సాక్షి మీడియా గ్రూప్‌ యాజమాన్యం స్టడీ మెటీరియల్‌ ఇచ్చారు. గణితం, సైన్స్‌ మెటీరియల్‌ చాలా చక్కగా ఉపయోగపడింది. ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో ఇచ్చిన సూచనలతో పాటు, స్టడీ మెటీరియల్‌ను చదడంతో సైన్స్‌ 100 మార్కులకుగాను 93, గణితంలో 99 మార్కులు వచ్చాయి. మొత్తంగా 561 మార్కులు సాధించి స్కూల్‌లో సెకెండ్‌ ప్లేస్‌లో నిలిచాను.

– ధరణి, మద్దికెర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

నేను హలహర్వి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాశాను. 600 మార్కులకుగాను 553 మార్కులు సాధించాను. సాక్షి మీడియా గ్రూప్‌ యాజమాన్యం ఇచ్చిన స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగపడింది. నేను అత్యధిక మార్కులు సాధించాను. – ప్రవీణ్‌కుమార్‌,

మేదేహల్‌ గ్రామం, హాలహర్వి మండలం

పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయుల బోధన, సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడ్డాయి. నాకు 550 మార్కులు వస్తాయనే అనుకోలేదు. ఆ మార్కుల సాధనకు సాక్షి స్టడీ మెటీరియల్‌ చాలా చక్కగా ఉపయోగపడింది. ఈ మెటీరియల్‌లో చాలా సులభమైన అంశాలు ఉన్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ నేర్చుకునేందుకు అవకాశం కలిగింది. – గౌస్‌ బాషా,

ఆలూరు ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాల

Advertisement
 
Advertisement
Advertisement