ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు బుధవా రం మొదటి విడత కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గిర్వానీ మాట్లాడుతూ..ఇంటర్ మొదటిసంవత్సరంలో ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించిన విద్యార్థినులకు మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసినట్లు చెప్పారు. మూడు రోజులుగా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.కౌన్సెలింగ్కు అనంతపు రం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి ఎంపికై న విద్యార్థినులు హాజరైనట్లు చెప్పారు. రెండవవిడత కౌన్సెలింగ్ తేదీని ఇంకా నిర్ణయి ంచలేదని,త్వరలో తెలుస్తుందని వెల్లడించారు.
వడ్డీ రేటు టెండర్ల పరిశీలన
మహానంది: మహానందీశ్వర స్వామి దేవస్థానానికి చెందిన సుమారు రూ.40 కోట్ల మొత్తాన్ని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు వడ్డీ రేట్లను కోరుతూ బుధవారం సీల్డు టెండర్లు నిర్వహించారు. ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, క్యాషియర్ నాగభూషణం ఆధ్వర్యంలో స్థానిక దేవస్థానం కార్యాలయంలో సీల్టు టెండర్లు తెరిచారు. ఈ సందర్భంగా ఏపీజీబీ వారు ఏడాదికి రూ.7.90 శాతం, ఎస్బీఐ 6.85 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.20 కోట్లకు పైగా డిపాజిట్ ఉంటే 7.20 శాతం వడ్డీ రేట్లను సూచిస్తూ కోట్ చేశారు. వీటిపై ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఏఈఓ మధు తెలిపారు. ఆయా బ్యాంకు శాఖల మేనేజర్లు రాఘవయాదవ్, హరీష్కుమార్, తిమ్మప్ప పాల్గొన్నారు.
పట్టుబడిన మద్యం ధ్వంసం
మంత్రాలయం: మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. బుధవారం ప్రొహిబిషన్, ఎకై ్సజ్శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈఎస్టీఎఫ్ రామకృష్ణారెడ్డి, మంత్రాలయం సీఐ రామాంజులు నేతృత్వంలో నాగలదిన్నె రోడ్డులో మద్యాన్ని నిర్వీర్యం చేశారు. 3,606 ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్లు ట్రాక్టర్తో తొక్కించారు. వాటి విలువ రూ.1,44,240 ఉంటుందని ఆయా శాఖల అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఎవరైనా అక్రమ మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో బెల్టు షాపులపై నిరంతర దాడులు చేపడతామన్నారు.

ఏపీఆర్జేసీ ప్రవేశాలకు కౌన్సెలింగ్