కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలోని సర్కారుతోటలో చోరీ జరిగింది. పోలీ సులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిలకలపూడి పోలీసుల కథనం మేరకు.. సర్కారుతోటకు చెందిన మోతుకూరి లలిత మచిలీపట్నం మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆప రేటర్గా పనిచేస్తున్నారు. లలిత తన తల్లితో కలిసి శనివారం ఇంటికి తాళం వేసి విజయవాడ వెళ్లారు. ఆదివారం ఉదయం పక్కింటి వారు లలితకు ఫోన్ చేసి వారి ఇంటి తలు పులు తెరచి ఉన్నట్లు చెప్పారు. దీంతో ఆమె హుటాహుటిన మచిలీపట్నంలోని ఇంటికి చేరుకున్నారు. బీరువా తలుపులు తెరచి ఉండటంతో పాటు, రూ.20 వేల నగదు, గాజులు, ఉంగరం, రూపులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించిన లలిత చిలకలపూడి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైలవరం మండలం పుల్లూరులోని చిలుకూరువారిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన దేవావతు రవి (30) ద్విచక్రవాహనంపై మైలవరం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు సెంటర్ సమీపంలో ఉన్న చిలుకూరువారిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్దకు వచ్చే సమయానికి మైలవరం నుంచి తిరువూరు వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొని రవి రహదారిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవిని స్థాని కులు 108 వాహనంలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సంఘనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


