చెరువుల్లో పూడికతీత చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

చెరువుల్లో పూడికతీత చేపట్టాలి

Jun 23 2025 6:55 AM | Updated on Jun 23 2025 6:55 AM

చెరువుల్లో పూడికతీత చేపట్టాలి

చెరువుల్లో పూడికతీత చేపట్టాలి

ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య

విజయవాడరూరల్‌: చెరువుల్లో పూడిక తీత పనులు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతులు వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ పొలాలు మెరక చేసుకునేందుకు చెరువుల ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులకు మాత్రమే మట్టిని తీసుకొనే అవకాశం కల్పించాలన్నారు. చెరువుల్లో మట్టి అక్రమ విక్రయాలకు గురికాకుండా ఉండాలన్నారు.

ఎత్తిపోతల పథకాలపై దృష్టి పెట్టండి..

అదే విధంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 39 ఎత్తిపోతల పథకాలున్నాయని వాటిల్లో ప్రధానమైన వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.15 కోట్లను మంజూరు చేశారని, అయితే ఇంత వరకు మరమ్మతుల పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. ఆ ఎత్తిపోతల పథకం పరిధిలో 20వేల ఎకరాల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయని మరమ్మతుల పనులు యుద్ధప్రాతిపదికన చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పోలంపల్లి ఆనకట్ట మరమ్మతుల పనులు, మునేరుపై ఎత్తిపోతల పథకం పనులు కూడా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement