ఘనంగా మెడికల్‌ కళాశాల వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మెడికల్‌ కళాశాల వార్షికోత్సవం

Jun 23 2025 6:55 AM | Updated on Jun 23 2025 6:55 AM

ఘనంగా మెడికల్‌ కళాశాల వార్షికోత్సవం

ఘనంగా మెడికల్‌ కళాశాల వార్షికోత్సవం

గన్నవరం రూరల్‌: నైతిక విలువలు, ధర్మం పునాధులుగా విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ భారతీయం సత్యవాణి ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి చిన అవుటపల్లి డాక్టర్‌ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాల 19వ వార్షికోత్సవాన్ని విద్యార్థుల కోలాహలం మద్య ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌, మేజర్‌ ఎంవీ భీమేశ్వర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యవాణి మాట్లాడుతూ పవిత్రమైన వైద్య వృత్తిలో స్థిరపడే విద్యార్థులు భారతదేశ ఔన్యత్యాన్ని, వారసత్వాన్ని, చరిత్రను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు వైద్య రంగంలో విశేషంగా రాణిస్తున్నారని అభినందించారు. కళాశాల డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య విద్యార్థులు క్రమశిక్షణతో ప్రగతి సాధించాలన్నారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య, ట్రెజరర్‌ సూర్రెడ్డి వెంకటేశ్వరరావు, డైరెక్టర్‌ డాక్టర్‌ సీవీ రావు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement