
పేద, మధ్యతరగతికి కార్పొరేట్ వైద్యమే లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించాలనే ఆశయంలో తన తండ్రి డాక్టర్ ఎన్. సుబ్బారావు పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. ఈ ఆస్పత్రిలో తన పిల్లలు వరుణ్, పవన్, మనోజ్ వర్షిణీ సేవలు అందించనున్నట్లు తెలిపారు. సూర్యారావు పేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్. సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్, ఆంధ్రా యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను ఆదివారం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, కామినేని శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజు, యురాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మనోజ్ తుమ్మల తదితరులు పాల్గొన్నారు.
24న వినియోగదారుల
కమిషన్ భవనం ప్రారంభం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వినియోగదారుల కమిషన్ కార్యాలయ మొదటి అంతస్తు భవనాన్ని ఈ నెల 24వ తేదీ మంగళవారం ప్రారంభించనున్నట్లు వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి ఆదివారం తెలిపారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, ఎంయూడీఏ చైర్మన్ మట్టా ప్రసాద్తో పాటు సివిల్ సప్లయీస్ కమిషనర్ సౌరభ్ గౌర్తో పాటు ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు దొమ్మేటి శ్రీనివాస్ పాల్గొంటారని ఆయన తెలిపారు.
పోటీల్లో విజేతలకు
బహుమతుల ప్రదానం
విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలకు గవర్నర్పేటలోని సర్వోదయ ట్రస్ట్, స్వాతంత్య్ర సమరయోధుల సంఘ భవనంలో బహుమతులు అందజేశారు. ఈ నెల 19వ తేదీన స్వాతంత్య్ర సమర యోధుల సంఘ భవనం వద్ద జరిగిన యోగా పోటీల్లో 150 మంది, చిత్రలేఖన పోటీల్లో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆదివారం బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్వో దయ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ జి.వి.మోహన్ప్రసాద్, కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, డ్రీమ్ యోగా అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు పి.రమేష్, కృష్ణాజిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్.మురళీకృష్ణ పాల్గొన్నారు.

పేద, మధ్యతరగతికి కార్పొరేట్ వైద్యమే లక్ష్యం