
కెనరా బ్యాంక్లో అగ్నిప్రమాదం
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని కోదాడ రోడ్లో ఉన్న కెనరా బ్యాంకులో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ వారు గుర్తించారు. ఉదయం 5 గంట ల సమయంలో బ్యాంకు నుంచి పొగలు రావడంతో బ్యాంకు ఉన్న బిల్డింగ్పై అంతస్తులో ఉన్న వాగ్దేవి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బుస్సా సురేష్ అగ్నిమాపక శాఖ వారికి, బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. మంట లు బిల్డింగ్ మొత్తం వ్యాపించకుండా నివారించడంతో పెను ప్రమాదం తప్పింది. ముందు గా పై అంతస్తులో ఉన్న నర్సింగ్ కళాశాల హాస్టల్ విద్యార్థులను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో బ్యాంక్ క్యాష్ కౌంటర్లోని కంప్యూటర్, టేబుల్స్ తదితర ఫర్నీచర్, ఫ్యాన్లు కాలిపోయాయి. సుమారు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పిల్లలు సహా మహిళ
ఆత్మహత్యా యత్నం
కృష్ణలంక(విజయవాడతూర్పు): మనస్తాపం చెంది ఇద్దరు పిల్లలు సహా ఆత్మహత్యకు యత్నించిన మహిళను కృష్ణలంక పోలీసులు కాపాడిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భవానీ పురం, ఎరుకల వారి వీధికి చెందిన జడిపట్ల లావణ్య, జ్యోతికిరణ్ భార్యాభర్తలు. వీరికి ఏడేళ్లు, నాలుగేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కిరణ్ ఆటోడ్రైవర్గా పనిచేస్తుండగా, లావణ్య సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తోంది. కిరణ్ రోజూ మద్యం తాగి వస్తుండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన లావణ్య పిల్లలతో కలిసి కృష్ణనదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణలంక పద్మావతి ఘాట్ పరి సరాల్లో కృష్ణానదిలోకి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వారించి స్టేషన్కు తరలించారు. సీఐ నాగరాజు మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చి భవానీపురం పోలీసులకు అప్పగించారు.