మద్యం మత్తులో దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో దారుణ హత్య

Jun 23 2025 6:55 AM | Updated on Jun 23 2025 6:55 AM

మద్యం

మద్యం మత్తులో దారుణ హత్య

జగ్గయ్యపేట అర్బన్‌: మద్యం మత్తులో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఆదివారం జరిగింది. జగ్గయ్యపేట సీఐ కార్యాలయంలో సీఐ పి.వెంకటేశ్వర్లు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలోని క్రిస్టియన్‌పేటకు చెందిన అభిమళ్ల వెంకయ్య (32) పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇనుము సామగ్రి లోడింగ్‌కు కూడా వెళ్తుంటాడు. మద్యం అలవాటున్న వెంకయ్యకు విలియంపేటకు చెందిన అల్లూరి కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పట్టణంలోని ఓ వైన్‌షాపు వద్ద వారిద్దరూ మద్యం తాగారు. ఆ మత్తులో గొడవ పడ్డారు. వెంకయ్యను ఎలాగైనా చంపుతానని అల్లూరి కృష్ణ బెదిరించాడు. అక్కడ ఉన్నవారు ఇద్దరినీ విడదీసి పంపించేశారు. ఆ తరువాత ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో పట్టణంలోని రైతుబజారు ఎదురుగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వెనుక ఒంటరిగా ఉన్న వెంకయ్యపై కృష్ణ రాయితో దాడిచేసి పారిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంక య్య మృతిచెందాడు. వెంకయ్య తల్లి మణి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తన కుమారుడు చనిపోయి ఉన్నాడని ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వెంకయ్య మృతదేహం పక్కన అతనిపై దాడికి వాడిన రాయి కూడా ఉంది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి అల్లూరి కృష్ణను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో పేట ఎస్‌ఐ జి.రాజు, చిల్లకల్లు ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మద్యం మత్తులో దారుణ హత్య 1
1/1

మద్యం మత్తులో దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement