కౌంటర్లు, దుకాణాల్లో ఈవో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

కౌంటర్లు, దుకాణాల్లో ఈవో తనిఖీలు

Jun 23 2025 6:55 AM | Updated on Jun 23 2025 6:55 AM

కౌంటర్లు, దుకాణాల్లో ఈవో తనిఖీలు

కౌంటర్లు, దుకాణాల్లో ఈవో తనిఖీలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవస్థాన కౌంటర్లతో పాటు దుకాణాల్లో ధరల బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని దుర్గగుడి ఈవో శీనానాయక్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఇంద్రకీలాద్రిపై రద్దీ నేపథ్యంలో ఈవో శీనానాయక్‌ పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. తొలుత ఓం టర్నింగ్‌ వద్ద ఉన్న పొంగలి షెడ్డును తనిఖీ చేసి, గతంలో గుర్తించిన లోపాలను సరి చేశారా లేదా అని పరిశీలించారు. అనంతరం దేవస్థానం కొబ్బరి కాయల కౌంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. రోజు వారి అమ్మకాలు, భక్తుల అభిప్రాయ సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు.

భక్తులతో మాట్లాడి..

లగేజీ, చెప్పుల స్టాండ్‌ వద్ద ఈవో భక్తులతో మాట్లాడారు. కౌంటర్లలో అధిక రుసుం వసూలు చేయరాదని, భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం టోల్‌గేట్‌ వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లో నీటి నాణ్యతను పరీక్షించారు. కనకదుర్గనగర్‌లో దుకాణాల వద్ద ధరల బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అమ్మవారి సన్నిధిలో నిద్ర చేసే భక్తులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈవో వెంట అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారావు, ఈఈ కోటేశ్వరరావు, ఇతర ఇంజినీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement