
బెల్టుషాపులు తొలగించాలని ధర్నా
కాగజ్నగర్టౌన్: బెల్టు షాపులు తొలగించాలని కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, కోయవాగుకు చెందిన మహిళలు శుక్రవారం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలుస్తున్నాయని, పురుషులు, యువ కులు మద్యం తాగుతూ హంగామా చేస్తున్నారన్నారు. ఇంట్లోని సామగ్రిని కూడా అమ్మి జల్సాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టుషాపులతోపాటు గుడుంబా కూడా దొరకడంతో వారికి అడ్డూఅదుపు లేకుండా పోతుందన్నారు. ఎకై ్సజ్ అధికారులు స్పందించి బెల్టుషాపులు, గుడుంబా స్థావరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ రవికుమార్కు వినతిపత్రం అందజేశారు.