
సమ్మె నోటీస్ అందజేత
ఆసిఫాబాద్అర్బన్: దేశవ్యాప్తంగా జూలై 9న చేపట్టే సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొంటున్నారని శనివారం జిల్లా కేంద్రంలో డీపీవో భిక్షపతిగౌడ్కు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, జీపీ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ సమ్మె నోటీస్ అందించారు. వారు మాట్లాడుతూ కార్మికులు త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందన్నారు. లేబర్ కోడ్లు అమలు చేస్తే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందని తెలిపారు. కార్మికులు ఐక్యంగా దేశవ్యాప్తంగా సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.