
గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
జైనూర్(ఆసిఫాబాద్): గిరిజనులు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అ మలు చేస్తోందని గిరిజన శాఖ డీడీ రమాదేవి అన్నారు. మండలంలోని భూసిమెట్ట గ్రామంలో శనివారం కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. పీఎం జుగా కింద ఎంపికై న గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఆధార్, ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతాలు అందించాలన్నారు. కార్యక్రమంలో జీసీడీవో శకుంతల, ఎస్ఈఆర్పీలు శంకర్, రాథోడ్, విజేందర్, పంచాయతీ కార్యదర్శి కుర్సెంగ ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు.