
అనుమానితుల సమాచారం అందించాలి
కాగజ్నగర్టౌన్: అనుమానిత వ్యక్తులు కని పిస్తే సమాచారం అందించాలని కాగజ్నగర్ డీఎస్పీ రామానుజన్ అన్నారు. పట్టణంలోని సంఘం బస్తీ, సుభాష్కాలనీ, తైబానగర్, అశోక్ నగర్ కాలనీల్లో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ అపరిచితులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడొద్దని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్లో 1.2 లీటర్ల దేశీదారు, 2.8 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నామని తెలి పారు. అలాగే సరైన ధ్రువపత్రాలు లేని 58 బైక్లు, 10 ఆటోలు గుర్తించామన్నారు.