
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
కాగజ్నగర్రూరల్: తాగునీటి కోసం కాగజ్నగర్ మండలం భట్టుపల్లికి చెందిన మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. 15 రోజులుగా భగీరథ నీరు సరఫరా కావడం లేదని, పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. విసుగుచెంది రోడెక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశా రు. భగీరథ సిబ్బందితోపాటు వాటర్మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాటర్మెన్ను నీటి కోసం సంప్రదిస్తే మహిళలు అని చూడకుండా దుర్భాషలాడుతున్నాడని ఆరోపించారు. పంచాయతీ సిబ్బందిని అడిగితే వాల్వ్ చెడిపోయిందని, హైదరాబాద్ నుంచి తీసుకురా వాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించేంత వరకు ధర్నా విరమించమని స్పష్టం చేశారు. దీంతో కాగజ్నగర్, దహెగాం ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనా లు నిలిచిపోయాయి. ఎంపీడీవో ప్రసాద్, పంచా యతీ కార్యదర్శి మహేశ్ స్పందించి సమస్య పరి ష్కరించడంతో మహిళలు ధర్నా విరమించారు.