
కాంగ్రెస్ ఇన్చార్జ్, పీసీసీ చీఫ్తో మంత్రి భేటీ
ఖమ్మంవన్టౌన్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ శనివారం ఖమ్మం వచ్చారు. భద్రాద్రి జిల్లా కిన్నెరసానిలో జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ సమ్మేళనంలో పాల్గొన్న వారిని తిరుగు ప్రయాణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిని మంత్రి సన్మానించగా.. జిల్లాలో పార్టీ పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించారు.
మదన్లాల్ కుటుంబానికి పరామర్శ
రఘునాథపాలెం: మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ కుటుంబాన్ని శనివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో మదన్లాల్ మృతి చెందగా, ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు తుల్లూరి బ్రహ్మయ్య, వాంకుడోత్ దీపక్, బొర్రా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.