రైల్వేట్రాక్‌ పక్కన మృతదేహం గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

రైల్వేట్రాక్‌ పక్కన మృతదేహం గుర్తింపు

May 31 2025 12:26 AM | Updated on May 31 2025 12:26 AM

రైల్వ

రైల్వేట్రాక్‌ పక్కన మృతదేహం గుర్తింపు

బోనకల్‌: మండలంలోని గోవిందాపురం(ఏ) రైల్వేట్రాక్‌ సమీపాన ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. పదిహేను రోజుల క్రితం సదరు యువకుడు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు తెలుస్తుండగా దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రైల్వే పోలీసులు శుక్రవారం పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోగా, ఆ పక్కనే లభించిన సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్లకు ఫోన్‌ చేయడంతో మృతుడు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం సీతారాంపురం వాసి నేతుల అనిల్‌బాబు(20)గా తేలింది. ఈ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇచ్చి నట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ అన్నం శ్రీనివాసరావు సాయంతో ఖమ్మం మార్చురీకి తరలించారు.

గుండెపోటుతో రైతు మృతి

కారేపల్లి: పంటల సాగు పనుల్లో నిమగ్నమైన రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన కామేపల్లి మండలం మంగళితండా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పిల్లలమర్రి వెంకటేష్‌(30) రెండున్నర ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, వరి సాగుకు ఏర్పాట్లుచేసుకుంటున్నాడు. ఈక్రమాన శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పగా గుండెపోటుగా గుర్తించిన కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. ఆయనకు భార్య ఉమ, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి...

చింతకాని: అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని తిమ్మినేనిపాలెంకు చెందిన తుడం రవి(55) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈనేపథ్యాన ఆయన భార్య పొలం పనులకు వెళ్లిన సమయాన గురువారం పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు.

రైల్వేట్రాక్‌ పక్కన మృతదేహం గుర్తింపు1
1/1

రైల్వేట్రాక్‌ పక్కన మృతదేహం గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement