ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమం

May 31 2025 12:26 AM | Updated on May 31 2025 12:26 AM

ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమం

ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమం

ఖమ్మంమయూరిసెంటర్‌: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధిహామీ పథకానికి తగినన్ని నిధులు కేటాయించకుండా.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నిన నేపథ్యాన చట్టం పరిరక్షణకు ఉద్యమించాలని సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆయా సంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడంతో పనిదినాలు తగ్గగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీ లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇకనైనా నిధులు, పనిదినాల సంఖ్య పెంచడమే కాక రైతు కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ను వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, శ్రీనివాసరావు, తాళ్లపల్లి కృష్ణ, వత్సవాయి జానకీరాములు, కొండెబోయిన నాగేశ్వరరావు, పొన్నగంటి సంగయ్య, కే.వీ.రెడ్డి, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, ఎస్‌.నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement