కిష్టారం ఓసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

కిష్టారం ఓసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా శ్రీనివాస్‌

May 30 2025 12:14 AM | Updated on May 30 2025 12:14 AM

కిష్ట

కిష్టారం ఓసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా శ్రీనివాస్‌

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా కసనబోయిన శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈమేరకు యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులను గురువారం జీఎం శాలేంరాజు అందించారు. సింగరేణి గతేడాది ఇంటర్నల్‌ నోటిఫికేషన్‌ ద్వారా మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(వెల్ఫేర్‌ ఆఫీసర్‌)లుగా పలువురిని ఎంపిక చేయగా కొందరికే పోస్టింగ్‌ ఇచ్చింది. మిగతా వారు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. దీంతో ఐదుగురికి పదోన్నతి కల్పించగా అందులో శ్రీనివాస్‌ ఉన్నారు. అలాగే, కె.కల్యాణ్‌ రాజ్‌కుమార్‌ను ఆర్జీఓసీ–2కు, ఏ.మధును అడ్రియాలకు, సిరిమల్లె అశోక్‌ను ఇల్లెందు కేఓసీకి, దాసరి నాగరాజును జీడీకే 2, 2ఏకు కేటాయించారు.

2న హ్యాండ్‌బాల్‌ జట్ల

ఎంపిక పోటీలు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్‌ బాలబాలికల జట్ల ఎంపికకు జూన్‌ 2న పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ పి.రఘునందన్‌ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్‌ కార్డుతో ఉదయం 10 గంటలకల్లా రిపోర్టు చేయాలని సూచించారు.

ఏళ్లుగా ఉద్యోగ,

ఉపాధ్యాయులకు నిరాశే..

ఖమ్మం సహకారనగర్‌: తెలంగాణ ఏర్పడితే నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే 11ఏళ్లుగా నిరాశే మిగిలిందని తెలంగాణ ప్రొగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి మనోహర్‌రాజు పేర్కొన్నారు. యూనియన్‌ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఖమ్మంలోని కార్యాలయం వద్ద గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన మనోహర్‌రాజు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యాన ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.వీ.నాగేశ్వరరావు, వెంగళరావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డితో పాటు విజయ్‌, పద్మ, ముత్తయ్య, వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి, ఉమాదేవి, రాము తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి ఏఎస్పీగా

నరేందర్‌

కొత్తగూడెంఅర్బన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా గోపతి నరేందర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు.కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై అడిషనల్‌ ఎస్పీగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన నరేందర్‌ను పలువురు అధికారులు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

బొగ్గు టిప్పర్‌ దగ్ధం

అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లి మండలం శాంతినగర్‌ వద్ద జాతీయ రహదారిపై గురువారం బొగ్గు టిప్పర్‌ కేబిన్‌లో మంటలు చెలరేగి దగ్ధమైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సత్తుపల్లి సింగరేణి ఓపెన్‌కాస్టు నుంచి బొగ్గు లోడ్‌తో వచ్చిన టిప్పర్‌ కొత్తగూడెంలో అన్‌లోడ్‌ చేసి తిరిగి వెళ్తోంది. ఈక్రమాన టిప్పర్‌ కేబిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్‌ వాహనం నిలిపేసి దిగాడు. అనంతరం పోలీసులు చేరుకోగా, సత్తుపల్లి నుంచి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

కిష్టారం ఓసీ వెల్ఫేర్‌  ఆఫీసర్‌గా శ్రీనివాస్‌1
1/2

కిష్టారం ఓసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా శ్రీనివాస్‌

కిష్టారం ఓసీ వెల్ఫేర్‌  ఆఫీసర్‌గా శ్రీనివాస్‌2
2/2

కిష్టారం ఓసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement