‘శక్తివంతమైన నాయకుడు నెహ్రూ’ | - | Sakshi
Sakshi News home page

‘శక్తివంతమైన నాయకుడు నెహ్రూ’

May 28 2025 12:29 AM | Updated on May 28 2025 12:29 AM

‘శక్తివంతమైన నాయకుడు నెహ్రూ’

‘శక్తివంతమైన నాయకుడు నెహ్రూ’

ఖమ్మంవన్‌టౌన్‌: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ భారత రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడిగా నిలిచారని కాంగ్రెస్‌ జిల్లాఅధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు తెలిపారు. నెహ్రూవర్ధంతి సందర్భంగా ఖమ్మంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పంచవర్ష ప్రణాళికలకు శ్రీకారం చుట్టడమే కాక ముందుచూపుతో నీటిపారుదలకు కాల్వలు, ఆనకట్టల నిర్మాణానికి నెహ్రూ శ్రీకారం చుట్టారని తెలిపారు. నాయకులు, కార్పొరేటర్లు పోట్ల నాగేశ్వరరావు, నాగండ్ల దీపక్‌చౌదరి, దొబ్బల సౌజన్య, కన్నం ప్రసన్నకృష్ణ, సాయికుమార్‌, సయ్యద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌, సయ్యద్‌ గౌస్‌, ఎర్రం బాలగంగాధర తిలక్‌, మొక్కా శేఖర్‌గౌడ్‌, మలీదు వెంకటేశ్వర్లు, లకావత్‌ సైదులు, రాపర్తి శరత్‌, పల్లెబోయిన భారతీచంద్రం, పాలకుర్తి నాగేశ్వరరావు, యూసఫ్‌, కమతం రామకృష్ణ, బోడ శ్రావణ్‌, చంద్రిక, సమీరా, లక్ష్మి, జ్యోతి, కొత్తపల్లి పుష్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement