పథకాల అమలులో మీరే కీలకం | - | Sakshi
Sakshi News home page

పథకాల అమలులో మీరే కీలకం

May 28 2025 12:25 AM | Updated on May 28 2025 12:25 AM

పథకాల అమలులో మీరే కీలకం

పథకాల అమలులో మీరే కీలకం

ఖమ్మం సహకారనగర్‌: ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు, పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా వ్యవహరిస్తూ అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్‌ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ గత ఏడాది కంటే ఎక్కువ ధాన్యాన్ని తక్కువ సమయంలో సేకరించడంపై అభినందించారు. పైలట్‌ మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణతో వచ్చిన అనుభవం ఆధారంగా జూన్‌ 3నుంచి అన్ని మండలాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించాలని సూచించారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ల ద్వారా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని తెలిపారు. కాగా, నకిలీ విత్తనాల జాడ లేకుండా చూడడంతో పాటు ఎవరైనా అమ్మితే పీడీ యాక్ట్‌ అమలుచేయాలని ఆదేశించారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీని వాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు సన్యాసయ్య, శ్రీలత, చందన్‌కుమార్‌, భూక్యా శ్రీనివాస్‌, పుల్ల య్య, రాజేశ్వరి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

● జిల్లాలోని భవిత కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ పి.శ్రీజతో కలిసి సమీక్షించిన ఆయన మాట్లాడుతూ రానున్న ఇరవై రోజుల్లోగా జిల్లాలోని కేంద్రాల్లో టాయిలెట్లు, వాష్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, ఆకర్షణీయంగా పెయింటింగ్‌ వేయించాలని తెలిపారు. డీఈఓ సత్యనారాయణ, సీఎంఓ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

● బాలికల సంరక్షణలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు. ఖమ్మం రిక్కాబజార్‌ హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్లకు బాలికల రక్షణ, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌పై ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అనుమానితుల గుర్తింపు, వ్యక్తిగత భద్రతపై బాలికలకు అవగాహన కల్పించాలని, అవసరమైనప్పుడు అండగా నిలవాలని సూచించారు. డీఈఓ ఎస్‌.సత్యనారాయణ, జీసీడీఓ తులసి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరా మహిళా డెయిరీ

కార్యాచరణ వేగవంతం చేయాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు కార్యాచరణలో వేగం పెంచాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి ఆయన ఇందిరా మహిళా డెయిరీ, రాజీవ్‌ యువ వికాసం, మహిళా మార్ట్‌ ప్రారంభోత్సవంపై అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. మహిళా డెయిరీ లబ్ధిదారులను ఎంపిక చేసి పశుగ్రాసం పెంప కం, యూనిట్ల కొనుగోలుకు సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే, రాజీవ్‌ యువ వికాసం లబ్ధిదారుల వివరాలను కార్పొరేషన్‌, బ్యాంకుల వారీగా విభజించాలని చెప్పారు. ఇప్పటివరకు 7,722ప్రతిపాదనలు బ్యాంకులకు పంపగా 5,183 దరఖాస్తులకు సమ్మతి అందిందని తెలిపారు. వివిధ శాఖల అధికారులు ఎన్‌.సన్యాసయ్య, నవీన్‌బాబు, అలీమ్‌, జ్యోతి, పుల్ల య్య, విజయ లక్ష్మి, శ్రీనివాసరెడ్డి, మధుసూదన్‌, డాక్టర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ పురంధర్‌ పాల్గొన్నారు.

ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్‌ నమోదు చేయండి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement