ఎర్రుపాలెం: చిన్నతనం నుంచే విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరొచ్చని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఎర్రుపాలెంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసిన ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటివరకు పరీక్షలు ఎలా రాశారని ఆరా తీసిన ఆయన చదువులో రాణిస్తున్న ఆడపిల్లలు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. ఆ తర్వాత పాఠశాల రికార్డులను పరిశీలించిన డీఈఓ, మెనూ అమలు, మరమ్మతుల వివరాలు తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ కె.సరిత, ఎంఈఓ బి మురళీమోహన్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.