
రాష్ట్ర కబడ్డీ జట్టు వైస్కెప్టెన్గా హనీ
మధిర: మధిర పట్టణానికి చెందిన హనీ రాష్ట్ర కబడ్డీ జట్టుకు వైస్కెప్టెన్గా ఎంపికై ంది. ఖమ్మం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న హనీ 8వ తరగతి నుంచే కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపుతోంది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన జట్టులో భాగస్వామిగా ఉంది. శనివారం నుంచి ఉత్తరాఖండ్లో మొదలైన 5వ జాతీయ బాలికల కబడ్డీ పోటీల్లో అండర్–18 విభాగం తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు హనీ వైస్కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కాగా, తొలిరోజు పోటీల్లో తెలంగాణ జట్టు కేరళ రాష్ట్ర జట్టుపై విజయం సాధించింది. ఇంకా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.