మార్కెట్‌ కార్మికుల రేట్లపై సమావేశం | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ కార్మికుల రేట్లపై సమావేశం

Jun 29 2025 2:50 AM | Updated on Jun 29 2025 2:50 AM

మార్కెట్‌ కార్మికుల రేట్లపై సమావేశం

మార్కెట్‌ కార్మికుల రేట్లపై సమావేశం

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పనిచేసే వివిధ వర్గాల కార్మికుల రేట్ల పెంపు అంశంపై శనివారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ యరగర్ల హన్మంతరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రెండేళ్లకు ఒకసారి మార్కెట్‌ కార్మికుల కూలీ రేట్ల పెంపు ప్రక్రియ ఉంటుంది. కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ ఏడాది తమకు 25 శాతం రేట్లు పెంచాలని కోరుతూ మార్కెట్‌ కమిటీకి, ఖమ్మం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధి వర్గానికి వినతిపత్రాలు అందించారు. సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ కూలీ రేట్లు పెంచాలని ప్రతిపాదన చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ ఏడాది మిర్చితో పాటు మార్కెట్‌కు విక్రయానికి వచ్చే పంటలకు ధరలు లేక పోగా, గత ఏడాదితో పోలిస్తే ధరలు తగ్గాయని వివరించారు. పంటల ధరలు తగ్గినందున కార్మికుల రేట్లు పెంపు సమంజసం కాదని వివరించారు. రైతు సంఘాల ప్రతినిధుల అభ్యర్థనకు కార్మిక సంఘాల నేతలు సుముఖత వ్యక్తం చేశారు. జరిగిన చర్చ వివరాలను జిల్లా అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని మార్కెట్‌ కమిటీ స్పష్టం చేసింది. సమావేశంలో మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, రైతుంఘాల ప్రతినిధులు అడపా రామకోటయ్య, మాదినేని రమేశ్‌, దొండపాటి రమేశ్‌, షేక్‌ మీరా, నాగేశ్వరరావు, శేఖర్‌ గౌడ్‌, రవీందర్‌, యుగంధర్‌నాయుడు, ఖమ్మం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్‌రావు, హమాలీ, రెల్లుడు, స్వీపర్ల సంఘాల ప్రతినిధులు బండారు యాకయ్య, భూక్యా శ్రీనివాస్‌, మద్ది సత్యం, దడవాయి సంఘం బాధ్యులు నీలం రాజేశ్‌, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement