శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అంతర్గత రిజర్వేషన్ను తాత్కాలికంగా 17 శాతం నుంచి 15 శాతానికి పరిమితం చేసి అమలుకు ఆదేశాలిచ్చింది. ఈ రిజర్వేషన్లను మూడు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరికి 5.25 శాతం, బీ కేటగిరికి 5.25 శాతం, సీ కేటగిరికి 4.5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఒకవేళ ఆయా వర్గాల నుంచి అభ్యర్థులు లేని పక్షంలో మిగతా వర్గం అభ్యర్థులతో ఉద్యోగాలను భర్తీ చేసుకోవచ్చని తెలిపింది.
కొత్తగా ఉద్యోగాల భర్తీ
ఈ నేపథ్యంలో జారీ అయిన ఉద్యోగ నోటిఫికేషన్లను రద్దు చేసి, కొత్త అంతర్గత రిజర్వేషన్ నియమాల ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించింది. 56,432 ఉద్యోగాల నియామకాలకు ఇటీవల ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం భర్తీకి త్వరలో ప్రకటన ఇవ్వనున్నారు.


