అనుచిత వ్యాఖ్యలపై ధర్నా | - | Sakshi
Sakshi News home page

అనుచిత వ్యాఖ్యలపై ధర్నా

Jun 4 2025 12:27 AM | Updated on Jun 4 2025 12:27 AM

అనుచి

అనుచిత వ్యాఖ్యలపై ధర్నా

రాయచూరు రూరల్‌: కలబుర్గి జిల్లాధికారిణి ఫౌజియ తరన్నంను నిందించిన ఎమ్మెల్సీ రవి కుమార్‌, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గేను అవహేళనకరంగా మాట్లాడిన విధాన పరిషత్‌ ప్రతిపక్ష నాయకుడు నారాయణ స్వామిపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అందోళనలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ రవి కుమార్‌ ఒక ఉత్తమ జిల్లాధికారిణిని అవమానించడం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గేను విధాన పరిషత్‌ ప్రతిపక్ష నాయకుడు అవమానించడం తగదన్నారు. వారిపై చర్యలు చేపట్టి పదవుల నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శాసన సభ్యులు శరణేగౌడ బయ్యాపూర్‌, హంపయ్య నాయక్‌, ఎమ్మెల్సీ వసంత్‌ కుమార్‌, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్‌ రామస్వామి, జిల్లాధ్యక్షురాలు నిర్మల, బసవరాజ్‌ పాటిల్‌, రుద్రప్ప, అమరేగౌడ, శాంతప్ప, అస్లాం పాషా, ఈశప్ప, పామయ్య, రామన్న, జయన్నతదితరులు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులపై చర్యలకు డిమాండ్‌

కదం తొక్కిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు

అనుచిత వ్యాఖ్యలపై ధర్నా 1
1/1

అనుచిత వ్యాఖ్యలపై ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement