
వ్యక్తి దారుణ హత్య
హుబ్లీ: కొప్పళలో సోమవారం ఓ దారుణ హత్య జరిగింది. బేకరీలో తన పని మీద ఉన్న వ్యక్తిని బయటకు లాగి వేటాడి మారణాయుధాలతో దారుణంగా హత్య చేశారు. వివరాలు.. కొప్పళ జిల్లాలోని కుష్టిగి తాలూకా తావరగెరా పట్టణం నడిబొడ్డున ఉన్న ఓ బేకరీ దుకాణంలో కొనడానికి వచ్చిన ఓ వ్యక్తిని దుండగుల గుంపు మారణాయుధాలతో దాడి చేసి క్రూరంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ప్రమోద్, నాగరాజు, ప్రదీప్, రవి, గౌతమ్, మంజునాథ్గా గుర్తించగా, మరో వ్యక్తి పేరు తెలియరాలేదు. మొత్తం మీద ఏడుగురు అరెస్టు అయ్యారు. మృతుడిని చెన్నప్ప నారినాళ్గా గుర్తించారు. ఆస్తుల గొడవకు సంబంధించి బేకరీలో ఉన్న చెన్నప్పను లోపలికి వెళ్లి మారణాయుధాలతో హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగానే అతడు బేకరిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో దుండగులు ఇద్దరు అతనిని వెంటపడి మారణాయుధాలతో దాడిఆ చేసి దారుణంగా హత్య చేశారు. మరో వ్యక్తి చేతికి దొరికినా కలపదిమ్మెతో తలపై కొట్టాడు. కాగా ఈ హత్య దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొత్తం మీద హత్య చేయడానికి వచ్చిన దుండగులు తమ పని ముగించుకొని దర్జాగా వెళ్లిపోయినట్లుగా తెలిసింది. కాగా తావరగెరె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ దారుణ హత్యతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.