
బాను ముష్తాక్ గర్వకారణం: సీఎం
శివాజీనగర: సాహిత్యానికి సమాజాన్ని వృద్ధిచేసే శక్తి ఉందని, సాహిత్యం ద్వారా సమాజాన్ని ఐకమత్యం చేయాలే గాని విభజించరాదని సీఎం సిద్దరామయ్య అన్నారు. సోమవారం విధానసౌధలో బుకర్ పురస్కార గ్రహీత, కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ అభినందన సభ జరిపారు. ఆమెను సీఎం సన్మానించి మాట్లాడారు. బాను ముష్తాక్ కన్నడ కీర్తిని పెంచారు. ఇది కన్నడ ప్రపంచానికే గర్వకారణమని ప్రశంసించారు. బాను ముష్తాక్ను, ఆమె రచనలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తికి రూ.10 లక్షల చొప్పున నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించారు. పాత్రికేయురాలిగా, రచయితగా, న్యాయవాదిగా, ఉద్యమకారిణిగా సమాజంలో రాణించారని బాను ముష్తాక్ను కొనియాడారు. ముస్లిం సముదాయపు మహిళ మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ రాసే ప్రగతిపరమైన శ్రద్ధ ఆమెలో ఉందని అన్నారు.