
భగీరథ మహర్షి దృఢ సంకల్పం ఆదర్శం
బళ్లారిటౌన్: మహర్షి భగీరథ దృఢ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా గ్యారంటీ పథకాల ప్రాధికార అధ్యక్షుడు కేఈ చిదానందప్ప పేర్కొన్నారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ కన్నడ సాంస్కృతి శాఖ, మహనగర పాలికె ఆధ్వర్యంలో జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఆదివారం చేపట్టిన భగీరథ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం వివిధ వర్గాల గురువుల జయంతులను ఏటా చేపడుతుందని గుర్తు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రమోద్మాట్లాడుతూ భగీరథ మహరాజు తపస్సు చేసి గంగను భూమికి తీసుకొచ్చారన్నారు. కన్నడ ఉపన్యాసకుడు అమాసి బసవరాజు భగీరథుడి చరిత్రను వివరించారు. డీ.కాశిం అలీ బృందంచే భక్తి గీతాలను వినిపించారు. కార్పొరేటర్ పీ.గాదెప్ప, ఉప్పార సమాజం నేతలు హనుమేష, యూ.ఎర్రిస్వామి, కన్నడ సాంస్కృతిక శాఖజేడీ నాగరాజు పాల్గొన్నారు.
రాయచూరురూరల్ : భగీరథ జయంతిని అదివారం పండిత సిద్దరామ జంబలదిన్న రంగ మందిరంలో నిర్వహించారు. ఎమ్మెల్సీ వసంత్ కుమార్, గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. ప్రజా పిత బ్రహ్మ కుమారీ ఈఽశ్వరి విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత, సమాజ నేతలు చంద్ర శేఖర్, పాగుంటప్ప, ప్రవీణ్, వెంకటేష్, దేవేంద్రప్ప, ఈరణ్ణ, మాలతీ, సురేఖ, తహీసీల్దార్ సురేష్వర్మ పాల్గొన్నారు. ఉప్పార సమాజం ఆధ్వర్యంలో మంత్రి బోసు రాజు భగీరథ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

భగీరథ మహర్షి దృఢ సంకల్పం ఆదర్శం

భగీరథ మహర్షి దృఢ సంకల్పం ఆదర్శం