పహల్గాం దాడిపై నిరసన | - | Sakshi
Sakshi News home page

పహల్గాం దాడిపై నిరసన

Apr 29 2025 9:26 AM | Updated on Apr 29 2025 9:26 AM

పహల్గాం దాడిపై నిరసన

పహల్గాం దాడిపై నిరసన

హొసపేటె: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఏబీవీపీ సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. నగరంలోని శంకర్‌ ఆనంద్‌సింగ్‌ కళాశాల నుంచి పునీత్‌ రాజ్‌కుమార్‌ సర్కిల్‌ వరకు వందలాది మంది విద్యార్థులు నిరసన తెలిపారు. ఆ తర్వాత వారు అప్పు సర్కిల్‌ వద్ద మానవహారంగా ఏర్పడి ఉగ్రవాద దాడిని ఖండించారు. అనంతరం ఏబీవీపీ నిరసన తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుంది. తీవ్రవాదుల కాల్పులు జరపడం ఖండనీయం. పాకిస్తాన్‌ ప్రాయోజిత ఉగ్రవాదులు ఎప్పుడూ ముందుకు వచ్చి పోరాడలేదు. వారు వెనుక నుంచి వచ్చి దొడ్డిదారిన ప్రజలను చంపుతున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఈ విషయమై దాయాది దేశానికి చాలా ఘాటుగా దౌత్యపరమైన ప్రతిస్పందనను ఇచ్చారన్నారు.

పహల్గాం మృతులకు ఘన నివాళి

హుబ్లీ: పహల్గాంలో ఉగ్రవాదుల ఉన్మాద చర్యకు మృతులైన 26 మంది పర్యాటకుల ఆత్మశాంతిని కోరుతూ దాజిబానపేట శ్రీతుళజా భవాని దేవస్థానంలో కొవ్వొత్తులను వెలిగించి ఘనంగా నివాళి అర్పించారు. ఎస్‌ఎస్‌కే సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారికి తగిన గుణపాఠం నేర్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ సమాజ ప్రముఖులు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అమానుషం అన్నారు. ఉగ్రవాదం భారతీయులను ఎన్నటికీ భయపెట్టలేదన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే దుష్టులకు వ్యతిరేకంగా పోరాడే ఉక్కు సంకల్పం భారతీయులకు ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు అశోక్‌ కాట్వే, విఠల లద్వా, నాగేష్‌ కలబుర్గి, హనుమంత, నిరంజన, నారాయణ జరా తరగర, వెంకటేష్‌ కాట్వే, ప్రకాష్‌ బురబురే, సంజయ్‌, రాజు, మిథున్‌ చవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement