
శాకంబరీ దేవికి అలంకారం
బనశంకరి: బనశంకరి దేవి దేవస్థానంలో వెలసిన శాకంబరీదేవి ఆదివారం కూరగాయల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. వేకువజామున సుప్రభాత సేవ, అర్చనలు గావించారు. వివిధ రకాల కూరగాయలతో రమణీయంగా అలంకరణ గావించారు. భక్తులు నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు.
ఎమ్మెల్యే మునిరత్న
ప్రాసిక్యూషన్కు ఓకే
బనశంకరి: బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న పై చార్జిషీట్ దాఖలైన కేసులో ప్రాసిక్యూషన్ కు విధానసభ స్పీకర్ యుటీ.ఖాదర్ అనుమతిచ్చారు. హనీట్రాప్ చేయడానికి హెచ్ఐవీ వ్యాధి కలిగిన మహిళను ఎరవేయడం, దళితులను దూషించడం అనే కేసుల్లో మునిరత్న పై కొన్ని నెలల కిందట ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మునిరత్న పరప్పన అగ్రహార జైలులో ఉంటూ బెయిల్పై విడుదలై బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కులదూషణ కేసు మునిరత్నను తీవ్ర చిక్కుల్లో పడేసింది. ఆయనను విచారించవచ్చని స్పీకర్ అనుమతిచ్చారు. కులదూషణ కేసును సీఐడీ, సిట్ విచారిస్తున్నాయి. సిట్ కోర్టులో తాజాగా చార్జిషీట్ను వేసింది. మునిరత్న ఎమ్మెల్యేగా ఉండటంతో ప్రాసిక్యూషన్కు అనుమతి కోరుతూ స్పీకర్ ను అభ్యర్థించాయి.
హరికథను కాపాడుకోవాలి
తుమకూరు: హరికథ అనేది ఒక జాత్యాతీత కళ అని, ఈ కళకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని, అటువంటి హరికథను కాపాడుకోవడం, దానిని మన ముందు తరాలవారికి ఆందించడం యువ కళాకారుల బాధ్యత అని సీనియర్ సుగమ సంగీత కళాకారుడు డాక్టర్.ఆర్. కే. పద్మనాభన్ అన్నారు. తుమకూరులోని కన్నడ భవనంలో జీ సోమశేఖర్ ప్రతిష్టాపణ ఆధ్వర్యంలో కర్ణాటక హరిదాస సమావేశం– 2025 వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. సుగమ సంగీతం, నృత్య గమక ఇలాంటి కళల కంటే హరికథ కోసం అన్ని వర్గాల ప్రజలు తరలివస్తారని అన్నారు. గురురాజులు నాయక హరికథలో ప్రసిద్ధులని అన్నారు. నా పాటల మీద హరికథ ప్రభావం చాలా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులను సన్మానించారు.
సర్పాల సయ్యాట
గౌరిబిదనూరు: ఇక్కడ నేషనల్ కళాశాల ఎదురుగా ఖాళీ స్థలంలో 7 పాములు ప్రజల కంట పడ్డాయి. దీంతో జనం హడలిపోయారు. వాటిలో రెండు పాములు సుమారు అర్ధ గంటకు పైబడి సల్లాపాలు సాగించడంతో జనం కుతూహలంగా చూశారు. వందలాదిమంది గుమిగూడినా పాములు పట్టించుకోకుండా సయ్యాటలో మునిగితేలాయి. పాముల గురించి సమాచారం ఇవ్వగా, అటవీశాఖ ఉద్యోగి యల్లప్ప వచ్చి ఓ పామును మాత్రం పట్టుకున్నారు. మిగతా 6 పాములు ఎటో వెళ్లిపోయాయి. పట్టణంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. చెత్త, గుబురు మొక్కల వల్ల పాములు, కొండచిలువలు చేరే ప్రమాదం ఉందని వాపోయారు.

శాకంబరీ దేవికి అలంకారం

శాకంబరీ దేవికి అలంకారం