
ముంబయ్లో పొరండ్ల వాసి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన పర్స రమేశ్ (40) ముంబయ్లో శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్ కొద్దికాలంగా ముంబయ్లోని కామటిపూర్ కల్లు దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు ఫోన్ మాట్లాడాడు. అనంతరం ఉరేసుకున్నాడు. కల్లు దుకాణం నిర్వాహకుడు రమేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రమేశ్కు భార్య భాగ్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. లక్ష్మీపూర్కు చెందిన ముగ్ధం అశోక్(25) పెళ్లి కాకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. తన అవసరాల కోసం పలువురి వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి పురుగుల మందుతాగి కుటుంబ సభ్యులకు ఫోన్చేసి చెప్పాడు. దీంతో అశోక్ను హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శనివారం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా ప్రాణాలు పోయాయి. మృతుడికి తండ్రి రాజయ్య, అన్నలు మహేశ్, సురేశ్ ఉన్నారు. మృతుడి చిన్నాన్న రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై ఎం.ఉపేంద్రచారి తెలిపారు.
చికిత్సపొందుతూ విద్యార్థి మృతి
గన్నేరువరం: గన్నేరువరంకు చెందిన కూన వైష్ణవి(14) అనే విద్యార్థి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు ఎస్సై నరేందర్రెడ్డి తెలిపారు. కూన సంపత్– అనిత కూతురు వైష్ణవి గన్నేరువరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. 8వతరగతి చదివేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో ఇటీవల సీటు లభించింది. దీంతో ఈ ఏడాది విద్యాభ్యాసానికి తల్లిదండ్రులు హాస్టల్ పంపించారు. అక్కడ ఉండి చదువుకోవడానికి వైష్ణవి నిరాకరించడంతో తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. హాస్టల్లో ఉంటూ చదువుకోవాలని తల్లిదండ్రులు కోరగా.. చదువుకోనని మనస్తాపం చెంది ఈనెల 23న పురుగు ల మందు తాగింది. గమనించిన కుటుంబ స భ్యులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన చి కిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ముంబయ్లో పొరండ్ల వాసి ఆత్మహత్య

ముంబయ్లో పొరండ్ల వాసి ఆత్మహత్య