
మట్టి టిప్పర్ల పట్టివేత
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం కొడుముంజ శివారులోని రామప్ప ఆలయం గుట్టల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న 10 టిప్పర్లు, 2 హిటాచ్చి జేసీబీలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. గుట్ట నుంచి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారనే సమాచారంతో వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ నటేశ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ముగ్గురు ఉత్తమ్ కరుణాకర్, భువనగిరి మహేశ్, లంబ ప్రశాంత్లపై కేసు నమోదు చేశారు.
10 టిప్పర్లు, 2 హిటాచీలు స్వాధీనం
ఎస్పీ మహేశ్ బీ గీతే