
క్యాప్సికమ్తో అమ్మవారికి అలంకరణ
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ నగునూర్లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆషాఢమాసం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం అమ్మవారిని క్యాప్సికమ్ మాలలతో అలంకరించారు. భక్తులు ఒడిబియ్యం, చీరెసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ వంగల లక్ష్మన్, కమిటి సభ్యులు పాల్గొన్నారు.
సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయండి
చొప్పదండి: గత ప్రభుత్వం అర్ధంతరంగా వదిలేసిన సెంట్రల్ లైటింగ్ పనులకు తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ పనులపై శనివారం సంబంధిత కాంట్రాక్టర్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం తగదని, నాణ్యతగా నిర్వహించాలని సూచించారు. నాణ్యత విషయంలో అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తే చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో కొండగట్టు ఉత్సవ సమితి చైర్మన్ ఇప్ప శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మునిగాల రాజేందర్, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్, కొట్టె అశోక్, నిజానపురం చందు, గుర్రం రాజేందర్రెడ్డి, ముద్దసాని రంగయ్య, వల్లాల కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు.
3, 4 తేదీల్లో విద్యాసంస్థల బంద్
విద్యానగర్(కరీంనగర్): జిల్లాలో జూలై 3,4వ తేదీల్లో ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్లు జార్జిరెడ్డి పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రత్నం రమేశ్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. విద్యారంగంపై ప్రభుత్వ వివక్ష కారణంగా రాష్ట్రంలో సు మారు రూ.8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని ఆ రోపించారు. విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ, తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్తో బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నాయకులు రత్న నరేశ్, శివ, రోహిత్, సాయి, రామ్, కిరణ్, విష్ణు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఇందిరాగార్డెన్లో జరిగిన యువజన కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన చీఫ్గెస్ట్గా హాజరయ్యారు. కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతీ ఒక్కరు కృషిచేయాలన్నారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు విత్ ఐవైసీ యాప్ను వాడాలని సూచించారు. అంతకుముందు శివచరణ్రెడ్డికి స్వాగతం పలికిన జిల్లా శ్రేణులు, నగరంలో ర్యాలీ నిర్వహించా యి. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

క్యాప్సికమ్తో అమ్మవారికి అలంకరణ

క్యాప్సికమ్తో అమ్మవారికి అలంకరణ

క్యాప్సికమ్తో అమ్మవారికి అలంకరణ