తాళం వేసిన ఇంట్లో చోరీ కేసులో అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ కేసులో అరెస్ట్‌

Jun 29 2025 2:53 AM | Updated on Jun 29 2025 2:53 AM

తాళం వేసిన ఇంట్లో చోరీ కేసులో అరెస్ట్‌

తాళం వేసిన ఇంట్లో చోరీ కేసులో అరెస్ట్‌

మంథని: వరుస దొంగతనాలతో పట్టణ ప్రజల్లో నెలకొన్న భయాందోళనకు పోలీసులు తెరదించారు. కేవలం నాలుగు రోజుల్లోనే రెండు చోరీలను ఛేదించారు. ఈ నెల 22న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో గ్రామానికి వెళ్లిన ఇల్లెందుల వెంకటేశ్వర్లు ఇంట్లో చోరీచేసిన స్థానికుడు తిరునహరి రాజనర్సింహస్వామిని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ రాజు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా కేసును ఛేదించి, టీవీ, వెండివస్తువులను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలించనట్లు పేర్కొన్నారు.. కేసును ఛేదించిన ఎస్సై రమేశ్‌, ఏఎస్సై స్వామి, కానిస్టేబుళ్లు రమేశ్‌, రాజ్‌కుమార్‌, శివ, అశోక్‌ను సీఐ అభినందించారు. అలాగే కరీంనగర్‌కు చెందిన చీర్ల తిరుపతిరెడ్డి స్థానిక పెట్రోల్‌ బంక్‌లో ద్విచక్రవాహనం పార్క్‌ చేసి వెళ్లగా.. ఈనెల 27న అదృశ్యమైంది. ఈ కేసులో మంథని మండలం అడవిసోమన్‌పల్లి గ్రామానికి చెందిన రత్నం రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement