
అంజన్న గర్భగుడి దర్శనం సులభం
మల్యాల: కొండగట్టు అంజన్నను భక్తులు దర్శించుకునేందుకు ఆలయ అధికారులు కొన్ని మార్పులు చేపట్టారు. భక్తులకు గర్భగుడి దర్శనం కల్పించేలా ధర్మదర్శనం క్యూ లైన్ను పది అడుగుల దూరం పెంచారు. ఆలయ ఆదాయం పెంపు కోసం గర్భగుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెంచేందుకు.. వారు గర్భగుడి వద్ద కూర్చుని స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. గతంలో సాధారణ క్యూలైన్ల ద్వారా స్వామివారిని అతి సమీపం నుంచి దర్శించుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం మరో పది అడుగుల దూరం నుంచి స్వామివారి దర్శనం ఉండనుంది. ప్రస్తుతం గర్భగుడి దర్శనం టికెట్ ధర రూ.400 నుంచి రూ.800కు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆలయ ఆదాయం పెంపుపై దృష్టి సారించిన అధికారులు.. భక్తులకు వసతి సౌకర్యాల ఏర్పాట్లపైనా దృష్టి సారించాలని కోరుతున్నారు.
ధర్మదర్శనం క్యూలైన్ దూరం పెంపు

అంజన్న గర్భగుడి దర్శనం సులభం